వాస్తవానికి కరోనా తర్వాత ప్రభుత్వ నిర్ణయం మారుతుందని ఆశించారంతా. చిరంజీవి టీమ్ కూడా సీఎం జగన్ తో చర్చలు జరిపి అంతా బాగుంటుందని, త్వరలోనే శుభవార్త వింటారని చెప్పారు. కానీ అలాంటివేవీ జరగలేదు. కేవలం సెకండ్ షో కి మాత్రమే పరిమితం ఇచ్చారు. అది కూడా నైట్ కర్ఫ్యూ తీసివేయడం వల్ల. ఇక ఇప్పుడు తాజాగా భీమ్లా నాయక్ విడుదల సందర్భంలో థియేటర్ల వద్ద అధికారుల చెకింగ్ లు మొదలయ్యాయి. బెనిఫిట్ షో లు వేయొద్దు, టికెట్ రేట్లు పెంచొద్దు అంటూ నోటీసులిచ్చారు. దీంతో మరోసారి గొడవ మొదలైంది.
ఏపీ ప్రభుత్వం పవన్ కల్యాణ్ పై కక్షసాధింపు మొదలు పెట్టిందని విమర్శిస్తున్నారు కొంతమంది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సైతం ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. గతంలోనే బెనిఫిట్ షో లు రద్దు అనే నిబంధన ఉంటే.. మళ్లీ కొత్తగా నోటీసులు, చెకింగ్ లు ఎందుకంటున్నారాయన.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి