ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అత్యంత కీలకమైన పర్చూరు నియోజకవర్గంలో రాష్ట్ర విభజన తర్వాత రెండు సార్లు టీడీపీ పార్టీ గెలిచింది. మరోసారి గెలుపొంది హ్యాట్రిక్ కొడతామని టిడిపి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు మరోవైపు మూడు వేల ఓట్ల మెజారిటీతో ఉంటాం గెలవబోతున్నామని ప్రకటించింది.

 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సాంబశివరావు, వైసీపీ అభ్యర్థి యడం బాలాజీ పోటీ పడుతున్నారు. అయితే ఈసారి కూడా ఇక్కడ సైకిల్ గాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరి సాంబశివరావు ఇకనుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు. ఈసారి కూడా ఆయనదే విజయం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రామనాథం బాబు పర్చూరు నియోజకవర్గానికి వైసీపీ ఇన్చార్జిగా నియమితులయ్యారు. కానీ అతను ఆశించిన విధంగా ప్రజల్లో పార్టీని బలోపేతం చేయలేదు దీనివల్ల ఆమంచి కృష్ణమోహన్ కు ఆ బాధ్యతలను అప్పజెప్పారు.

అయితే ఆయన మంచి చేయాల్సింది పోయి గ్రానైట్ పరిశ్రమలను తన చేతుల్లోకి తీసుకున్నారట. అంతేకాకుండా సొంత పార్టీ నేతల పైనే కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేశారు. 7 వేల టీడీపీ ఓట్లను కూడా ఆయన తొలగించడంలో కీలక పాత్ర పోషించారు తర్వాత వైసీపీని వదిలి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆయన వెళ్లిపోవడంతో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలాజీని వైసీపీ ప్రకటించింది. కాపు కోటాలో ఇతడిని ఎన్నికల బరిలోకి దింపింది కానీ ఇక్కడ గెలవడం అంత సులభమేమీ కాదని వైసీపీ అధిష్టానానికి తెలుసు.

 అయినా బాలాజీ ఇక్కడికి గెలవడానికి ఏం తన వంతుగా కృషి చేశారు ఎలాంటి ఆర్బటాలకు పోకుండా చక్కగా ఎన్నికల ప్రచారాలను ముగించారు అయితే పాప సామాజిక వర్గ ప్రజల ఓట్లన్నీ తనకే పడతాయని ఆయన అనుకున్నారు కానీ వారి నుంచి ఈ నేతకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఈ నియోజకవర్గంలో 70 వేల కమ్మ సామాజిక ప్రజల ఓట్లు ఉన్నాయి. వీరి తర్వాత స్థానంలో 40 వేల కాపు ఓట్లు ఉన్నాయి. ఈ రెండు సామాజిక వర్గాలే ఈ నియోజకవర్గంలో గెలుపోవటములను ప్రభావితం చేస్తాయని అంటున్నారు.

అయితే కాపు ప్రజల్లో సగం మంది టీడీపీకే సపోర్టు చేస్తున్నారు. 80% కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు టీడీపీ కోసం పనిచేసినట్లు సమాచారం. మిగతా సామాజిక వర్గ ప్రజల విషయానికి వస్తే రెండు పార్టీలకు కూడా సరి సమానంగా ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే వైసీపీ వాళ్లు ఇక్కడి నుంచి గెలవడం కాస్త కష్టమే అని చెప్పుకోవచ్చు. జూన్ 4వ తేదీన ఎవరు గెలుస్తారనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: