
అయితే ఇలాంటి సమయంలోనే డ్వాక్రా మహిళల కోసం ఒకసారి కొత్త యాప్ ని ఏపీ ప్రభుత్వం తీసుకురాబోతోందట. రుణాలను సులభంగా చెల్లించడానికి మోసాలను అరికట్టడానికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుందని తెలుపుతున్నారు. ఇకపై ఇంట్లో నుంచి దర్జాగా మొబైల్ నుంచి డబ్బులు కట్టే విధంగా ఒక యాప్ ని తీసుకురాబోతోంది ఏపీ ప్రభుత్వం. ఈ యాప్ ద్వారా శ్రీనిధి రుణాల వాయిదాలను మొబైల్ నుంచే ప్రతి ఒక్కరు చెల్లించుకోవచ్చని తెలియజేస్తోంది .ముఖ్యంగా బ్యాంకులలో వాయిదాల చెల్లింపు విషయాలలో జరుగుతున్న మోసాలను అధికారులు తెలియజేయడంతో ఒక యాప్ ద్వారా బ్యాంకు లింకు చేసి మరి శ్రీనిధి రుణాలను అందించే విధంగా ప్లాన్ చేస్తోంది.
ఈ యాప్ ఉపయోగించడానికి ఎలాంటి చార్జెస్ అవసరం ఉండదని తెలియజేస్తున్నారు. మరొకవైపు ఇటీవలే మెప్మా వెబ్ సైట్ ను సైతం ప్రారంభించారు. దీనివల్ల భవిష్యత్తులో 80 వేల డ్వాక్రా సంఘాలకు సైతం ఎనిమిది వేల కోట్ల రూపాయలు రుణాలను అందించే విధంగా ప్లాన్ చేస్తున్నదట కూటమి ప్రభుత్వం. అయితే ఇందుకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలకే మెప్మా పిడీలు ఉన్నాయని రాబోయే రోజుల్లో వాటిని 26 జిల్లాలకు పెంచుతామంటూ ఆమె ఇవ్వడం జరిగింది మంత్రి నారాయణ.