ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదని బాధపడుతున్న లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం వరుసగా శుభవార్తలు అందిస్తూ వెళుతుంది. ఇప్పటికే తల్లికి వందనం పథకాన్ని ఎంతో విజయవంతంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం .. ఇక త్వరలోనే అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు 20,000 ఇచ్చే పథకం అమలుకు ఏర్పాట్లు చేస్తుంది . ఇదే సమయంలో త్వరలోనే మరో సూపర్ సిక్స్ పథకం అమలుకు రెడీ అవుతుంది . అందులో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాటు చేస్తుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా గత ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం రెడీ అవుతుంది ..


ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళల‌కు నెలకు 1500 వంతున ఏడాదికి 18 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటులు చేస్తుంది .  ఇక ఇప్పటికే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం మొదలు పెడతామని ప్రకటించిన ప్రభుత్వం .. అంతకుముందే ఆడబిడ్డ నీది పథకం అమలు చేయబోతున్నట్టు కూడా వార్త‌లు వస్తున్నాయి . నెలకు 1500 చొప్పున ఇచ్చే ఆడ‌బిడ్డ నిధి పథకం కోసం దరఖాస్తులు ఆన్లైన్లో తీసుకునేందుకు వీలుగా వెబ్సైట్ ను రేడీ చేస్తున్నట్టు తెలుస్తుంది .. అలాగే ఈ పథకం అమలు కోసం 3000 కోట్లకు పైగా నిధులు కూడా సమకూర్చుకుంటున్నారు .. ఈ ప్రక్రియ పూర్తి అవగానే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది .  


అయితే నిజానికి ఆటబిడ్డ నీధి పథకం అమలు కోసం ఈ ఏడాది బడ్జెట్లో కూటమీ ప్రభుత్వం 3300 కోట్లు నిధులు కూడా కేటాయించింది . ఇక ఈ నిధులతో బీసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు సుమారు 1000 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు .  అలాగే అధికంగా వెనకబడిన మహిళలకు మరో 630 కోట్లు , మైనార్టీ మహిళల కోసం 84 కోట్లు , ఎస్సీ ఎస్టీ వర్గాల ఆడబిడ్డల కోసం మిగిలిన నిధులు ఉపయోగించబోతున్నట్లు ప్రకటించారు .. ఇక దీంతో ఈ కీలక పథకం అమలు కోసం ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎంతో  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: