విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల నియోజవర్గం జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి భర్త జర్నలిస్టులను దూషించారు అన్నటువంటి అంశం ఇప్పుడు ఏపీ అంతట సంచలనంగా మారింది. ఇటీవలే జరిగిన భోగాపురం మండల సర్వసభ సమావేశంలో ముంజేరు ముక్కం పంచాయతీలకు మీ "మీరాకిల్" సంస్థ సుమారుగా రూ .42 లక్షల రూపాయల పన్నులు చెల్లించాల్సి ఉంది. వాటిని చెల్లించాల్సిందే అంటూ ఆ పంచాయతీలకు చెందిన సర్పంచులు జనసేన ఎమ్మెల్యే లోకం మాధవిని ప్రశ్నించారంటు జర్నలిస్టులు పత్రికలలో ప్రస్తావించారు.


అంతేకాకుండా జనసేన ఎమ్మెల్యేకి చెందిన మిరాకిల్ సాఫ్ట్వేర్ సంస్థలో ముంజేరులో 208,296,337,392,,343,342, వంటికి సర్వే నెంబర్లలో సుమారుగా 14 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ సంస్థ కోసం ఆక్రమించినట్లుగా రెవెన్యూ అధికారులు గుర్తించి.. అప్పట్లో ఆ భూములకు వేసిన రోడ్డు, కంచె అన్నిటిని కూడా తొలగించారనే విషయాన్ని అక్కడ పత్రికలు, మీడియా హైలెట్ చేశాయి.. దీంతో పాటుగా ధనాలపేట గ్రామంలో దళితుల భూమిని ఎమ్మెల్యే ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయనే విధంగా పత్రికా ప్రకటనలలో రాశారట. దీంతో ఆ నియోజకవర్గంలోని అధికారుల మీద జనసేన ఎమ్మెల్యే భర్త ఫైర్ అయినట్టుగా వినిపిస్తున్నాయి.


తనకు అనుకూలంగా లేని ఎంపీడీవోల మీద, ఇతర అధికారుల మీద కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టారని దీనివల్ల  ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి అధికారులు ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందట. ముఖ్యంగా భోగాపురం మండలంలో పనిచేయడానికి అధికారులు భయపడే పరిస్థితుల్లో ఉన్నాయనే విధంగా  వార్తలు పత్రికలలో రావడంతో ఈ విషయంపై పాత్రికేయుల మీద ఎమ్మెల్యే లోకం మాధవి భర్త విరుచుకుపడ్డారు.మా గురించి నెగిటివ్ గా వార్తలు రాస్తే తాటతీస్తామంటూ హెచ్చరించారు. తాజాగా జరిగిన ఒక మీటింగ్లో లోకం మాధవి భర్త విమర్శించడంతో ఈ విషయాన్ని పత్రికా సిబ్బంది రాయడానికి ఇబ్బంది పడడంతో వాళ్ల యొక్క వాట్సప్ గ్రూపులలో, సోషల్ మీడియాలో  ఈ విషయాన్ని వైరల్ గా  చేస్తే కొన్ని వీడియోలను షేర్ చేశారు. మరి ఈ విషయం పైన ఏపీ ప్రభుత్వం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: