కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలంగా  కూటమినేతల మధ్య విభేదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. కానీ కూటమి పార్టీ నేతలు మాత్రం ప్రతి ఒక్కరు కలిసే ఉండాలని అన్ని విషయాలలో సర్దుకుని పోవాలని చెబుతున్నప్పటికీ.. ఇటీవలే టిడిపిలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేసినేని చిన్ని వివాదం ఏపీలో సంచలనంగా మారింది. ఈ విషయం పైన టిడిపి అధిష్టానం కూడా సీరియస్ గానే ఫైర్ అయినట్లు వినిపించాయి. ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబుకు ఒక నివేదిక అందిందని, సీఎం చంద్రబాబుతో టిడిపి క్రమశిక్షణ కమిటీ సమావేశమై ఒక నివేదికను అందించారట కొనకొల్ల నారాయణ, వర్ల రామయ్యతో పాటుగా మరి కొంతమంది నేతలు సీఎం చంద్రబాబుకు ఈ నివేదికను అందించినట్లు తెలుస్తోంది.



తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ చిన్ని మధ్య వివాదం చెలరేగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు నేతలు కూడా ఒకరి పైన మరొకరు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఓపెన్ గానే విమర్శలు చేశారు. అంతేకాకుండా మీడియాకు ఎక్కి మరి ఇద్దరూ నాన్న రచ్చ చేశారు. ఈ విషయం టిడిపిలోనే సంచలనంగా మారింది. వీరి వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఏకంగా క్రమశిక్షణ కమిటీకి ఆరాతీయమని ఆదేశాలను జారీ చేశారు చంద్రబాబు.

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు క్రమశిక్షణ కమిటీ సభ్యులు నేతల మధ్య వివాదం పై ఆరతీయగా ఇరువురి నుంచి వివరణ తీసుకున్నారు. మరి ఆ నివేదికలో ఏముంది? అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. నివేదిక పరిశీలించిన తర్వాత సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు! ఎవరిపైన చర్యలు తీసుకుంటారనేదే ఇప్పుడు టిడిపి పార్టీలో ఆసక్తికరంగా మారింది. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం చిన్ని ఏకంగా రూ .5 కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ కొలికపూడి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఈ విషయం పైన ఎంపీ చిన్ని వైసిపి కోవర్ట్ అంటూ కొలికపూడి పైన ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: