అయితే, ఇటీవల కాలంలో పార్టీకి నష్టం జరుగుతుందనే అంచనాల నేపథ్యంలోనో లేక మారిన రాజకీయ సమీకరణాల కారణం గానో ఊహించని ప్రకటన వెలువడింది. బోరుగడ్డ అనిల్ కుమార్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని ఆ పార్టీ నాయకత్వం తేల్చి చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో గమనార్హం. ఆయన వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తి కాదని, కేవలం పార్టీకి మద్దతుగా మాట్లాడే వ్యక్తి మాత్రమే అన్నట్లుగా ఈ ప్రకటన వెలువడింది. ఈ ప్రకటన సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చకు దారి తీసింది.
ఇన్నాళ్లూ పార్టీకి మద్దతుగా, ప్రత్యర్థులపై అత్యంత కఠినమైన విమర్శలు చేసిన వ్యక్తిని ఆకస్మాత్తుగా తమవాడు కాదని ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటని నెటిజన్లు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అనిల్ కుమార్ చేసిన ఇష్టానుసారపు వ్యాఖ్యల వల్ల పార్టీ ప్రతిష్ట దిగజారుతోందని, ముఖ్యంగా ఎన్నికల ఫలితాల తర్వాత మరింతగా ఈ నష్టాన్ని గుర్తించిన పార్టీ నాయకత్వం, భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఈ ప్రకటన చేసిందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి, అనిల్ కుమార్ వ్యవహారం, దానిపై వైఎస్సార్సీపీ ఇచ్చిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళానికి దారి తీసిందనే చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి