ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడలో కడపుమంట బాగా పెరిగిపోతోంది. అసలు ఆయనలో ఇంతగా కడుపుమంట ఉందని కూడా ఇప్పటివరకు ఎవరు గుర్తించలేదేమో. ఇంతకీ విషయం ఏమిటంటే విశాఖపట్నంలోని శారదాపీఠంకు జగన్మోహన్ రెడ్డి ఆ మద్య వెళ్ళారు గుర్తుందా. పీఠంలో జరిగిన రాజశ్యామల యాగంలో పాల్గొనేందుకు జగన్ వెళ్ళారు. ఇదే విషయమై అసందర్భంగానే అయినా చంద్రబాబు తన కడుపుమంటను బయటపెట్టుకున్నారు. కడుపుమంటను బయటపెట్టుకున్నారనేకన్నా సోషల్ మీడియా  బయటపెట్టందనటం సబబుగా ఉంటుందేమో. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే శారదాపీఠాధిపతి దొంగస్వామంటు పెద్ద ఎత్తున బురద చల్లేశారు. చంద్రబాబు మొదలుపెట్టగానే తమ్ముళ్ళు కూడా నోటికి పనిచెప్పేశారు.




పీఠాధిపతిపై చంద్రబాబు నోరు పారేసుకున్నారో లేదో వెంటనే సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు దర్శనం ఇచ్చాయి. దీంతోనే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలోని కడుపుమంట బయటపడింది. పీఠాధిపతిని జగన్ తరచు వెళ్ళి దర్శించుకోవటాన్ని ఎందుకో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఈ నేపధ్యంలోనే నోటికొచ్చింది మాట్లాడేశారు. అయితే విషయం ఏమిటంటే తాను అధికారంలో ఉన్నపుడు ఇదే స్వాములోరి దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తాను వెళ్ళటం మాత్రమే అయితే పర్వాలేదు. ఇపుడు పీఠాధిపతిని విమర్శిస్తున్న వాళ్ళల్లో చాలామంది అప్పట్లో స్వామివారి ఆశీస్సుల కోసం క్యూ కట్టినవారే.




అంటే తాను అధికారంలో ఉన్నపుడు ఏమి చేసినా ఎవరు మాట్లాడకూడదు. అదే తాను ప్రతిపక్షంలోకి రాగానే తాను చేసిన పనినే అధికారంలో ఉన్నవారు చేస్తే తట్టుకోలేకపోతున్నారు.  శారదాపీఠాధిపతి దగ్గరకు చంద్రబాబు వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకున్నారు. యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, మురళీమోహన్, రామ్మోహన్ నాయుడు లాంటి ఎందతో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నవారే. మరిపుడు అదే పని జగన్ చేస్తుంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు. జగన్ మీద తనలో పేరుకుపోతున్న కసిని చివరకు స్వామి మీద తీర్చుకునేందుకు కూడా చంద్రబాబు వెనకాడటం లేదని అర్ధమైపోతోంది.  మామూలుగా వచ్చే కడుపు నొప్పి, లేదా కడుపుమంటకు మందులుంటాయి. కానీ చంద్రబాబుకు వచ్చే రాజకీయ కడుపుమంటకు మందుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి: