ఐపీఎల్ పోరు  ఎంతో రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న రాజస్థాన్ రాయల్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. పాయింట్ల పట్టికలో వరుసగా ఆరు ఏడు స్థానాల్లో కొనసాగిన జట్ల మధ్య  మ్యాచ్  జరగడంతో ఏ జట్టు విజయం సాధిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ కు ఘన విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి పాయింట్ల పట్టిక లో ఏడవ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకింది సన్రైజర్స్.



 విజయ ఢంకా మోగించి... తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. మొదటినుంచి పడుతూ లేస్తూ ప్రస్థానాన్ని కొనసాగించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు  నిన్న జరిగిన మ్యాచ్ లో మాత్రం ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది అని చెప్పాలి. వరుసగా మూడు ఓటమిలు  చవిచూసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తో జరిగిన మ్యాచ్ లో కూడా ఓడిపోతుందని సోషల్ మీడియా వేదికగా కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఆ అంచనాలను తారుమారు చేస్తూ సన్రైజర్స్ గెలిచింది. అంతేకాదు విజయం అనంతరం రాజస్థాన్ రాయల్స్ జట్టుపై సెటైర్లు కూడా వేసింది సన్రైజర్స్.




 ఇక మ్యాచ్ అనంతరం సన్రైజర్స్ హైదరాబాదు సోషల్ మీడియా వేదికగా రాజస్థాన్ రాయల్స్ పై సెటైర్లు వేస్తూ కౌంటర్ ఇచ్చింది. ఈనెల 11న సన్రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు జొమాటో లో మేం లార్డ్ హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేసుకుంటాం అంటూ  జట్టు యాజమాన్యం పోస్ట్ పెట్టడం అంతేకాకుండా రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ డాన్స్ చేయడం హైదరాబాద్ అభిమానులకు నచ్చలేదు. కాగా నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ పై సన్రైజర్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిత్రులారా బిర్యానీ ఆర్డర్ క్యాన్సిల్ చేయండి ఆ ఘాటు మీరు తట్టుకోలేరు పప్పు చాలు అంటూ సెటైర్ వేసింది సన్రైజర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: