మహేంద్ర సింగ్ ధోనీకి భారత క్రికెట్ చరిత్రలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్ కీ  సాధ్యం కాని రెండు ప్రపంచకప్ లను  అందించిన సారథిగా మహేంద్రసింగ్ ధోని చరిత్రలో నిలిచిపోయారు. మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కి సారథిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫార్మెట్ ఏదైనా మ్యాచ్ ఏదైనా మహేంద్ర సింగ్ ధోనీకి ఎంత మంది అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధోని పై తమకున్న అభిమానాన్ని ఎంతో వినోదంగా అభిమానులు చాటుకుంటూ ఉంటారు.



 ఇక అభిమానులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్న ఘటనలు ఎన్నో తెర మీదికి వచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇటీవలే ఓ అభిమాని తనకున్న అభిమానాన్ని ఎంతో కొత్తగా చాటుకున్నాడు. ఈ విషయం మహేంద్ర సింగ్ ధోనీ వరకు వెళ్లడంతో ధోని స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే అభిమాని చెన్నై సూపర్ జట్టు పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ తన ఇంటిని మొత్తాన్ని ధోని ఫోటోలతో చెన్నై జట్టు జెర్సీ  రంగులతో నింపేసాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 అంతేకాదు ఆ ఇంటికి హోమ్ ఆఫ్ ధోని అని కూడా పేరు పెట్టడం మరింత ఆసక్తికరంగా మారింది. తమిళనాడుకు చెందిన ధోని వీరాభిమాని గోపికృష్ణన్  తన ఇంటికి ఇలా రంగులు వేయించాడు. ఇక తాజాగా ఈ విషయంపై మహేంద్ర సింగ్ ధోనీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ ఇంటిని చూసినప్పుడు ఎంతో ఆనందంగా అనిపించింది... అతను కేవలం నాకు మాత్రమే కాదు మా జట్టు మొత్తానికి వీరాభిమాని... ఇలాంటి అభిమానులే మమ్మల్ని ఎప్పుడూ ముందుకు నడిపిస్తూ ఉంటారు.. ఇలాంటి అభిమానులను చూసినప్పుడే మేము ఎంతో సాధించాం అని అనిపిస్తూ ఉంటుంది అంటూ మహేంద్రసింగ్ ధోని బదులిచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: