సిటీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతున్న తరుణంలో ఇటీవల నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు ఆస్ట్రేలియా భారత్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ కామెంటేటర్ గా ఉన్న కొంతమంది ఆసీస్ మాజీ క్రికెటర్ల ను ఇంటికి పంపించేస్తున్నారు. ఇంటికి పంపిస్తున్న వారిలో దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ కూడా ఉండటం గమనార్హం. అంతేకాకుండా కొన్ని చానల్స్ కూడా తమ స్టాఫ్ లో కొంతమంది ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాయి. ఇలా ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న తరుణంలో ఈ ప్రభావం టెస్టు సిరీస్ పై కూడా ఉంనున్నట్లు తెలుస్తోంది.
జనవరి 7 నుంచి 11 వరకు జరగాల్సిన మూడవ టెస్ట్ మ్యాచ్ పై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఆటగాళ్లందరూ బయో సెక్యూర్ పద్ధతిలో క్రికెట్ ఆడుతుండగా... కేవలం ఆటగాళ్లతో పాటు కోచ్లు సహాయ సిబ్బంది కూడా బయో సెక్యూర్ పద్ధతిలోనే ప్రస్తుతం కఠిన నిబంధనల మధ్య ఉంటున్నారు అనే విషయం తెలిసిందే. కానీ మ్యాచ్ కామెంటేటర్లు ఛానల్ స్టాఫ్ మాత్రం ఈ బబుల్ లో లేకపోవడం గమనార్హం. మ్యాచ్ గాప్ సమయంలో వారు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో గడిపి మళ్లీ విధులకు వస్తున్నారు. ఈ క్రమంలోనే... నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకుని ఎక్కువ మంది స్టాఫ్ ఉండకుండా ఇంటికి పంపిస్తున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి