ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ చివరి మ్యాచ్ ఆడుతుండగా ఆ జట్టు కెప్టెన్ జో రూట్ తన బీకర ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. తొలి టెస్టులో డబుల్ సెంచరీ బాది శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన రూట్ రెండో టెస్టులో కూడా అదే ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఆదివారం జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 9 వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేసింది.  ఓవర్‌నైట్‌ స్కోరు 98/2 ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌ను స్పిన్నర్‌ ఎంబుల్‌దెనియా (7/132) దెబ్బ తీశాడు వద్ద అతను క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్‌ 252/6తో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జో రూట్ తన బ్యాట్ కు పని చెబుతూ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డ 257 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.

కానీ వికెట్లు పడుతున్నా బట్లర్‌ (55), బెస్‌ (32)లతో భాగస్వామ్యాలు నెలకొల్పిన రూట్‌... ఈ క్రమంలో ఆరు వికెట్లు కోల్పోయి 333 పరుగులతో భారీ స్కోరు వైపు అడుగులు వేస్తున్న ఇంగ్లాండ్ జట్టు ఆరు పరుగుల తేడాతో మూడు వికెట్లు కోల్పోయి 339 వద్ద నిలిచింది. వరుసగా రెండో డబుల్‌ సెంచరీకి 14 పరుగుల దూరంలో నిలిచిన రూట్‌.. ఆట చివర్లో రనౌటయ్యాడు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 5 నుండి ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో జో రూట్ బీకర ఫామ్ చూస్తూ ఉంటే టీమిండియా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టును అంత తేలిగ్గా అంచనా వేయడానికి లేదు అత్యుత్తమ క్రికెటర్లు ఆ జట్టు సొంతం.

ఇక భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో ఘన విజయం సాధించి మంచి ఆత్మ విశ్వాసం తో ఉంది. యువ క్రికెటర్లు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగల సత్తా ఉందని నిరూపించుకున్నారు. అయితే టీమిండియాలో కీలక ఆటగాళ్లు అయినా జడేజా, బుమ్రా , హనుమ విహారి, అశ్విన్, వంటి ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడడం కాస్త ఆందోళన కలిగించే అంశం. అయితే  ఒకవేళ మ్యాచ్ ప్రారంభానికి ముందు వాళ్ళు గాయాల నుండి కోరుకుంటే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ జట్టు తో జరిగే సిరీస్ తో మళ్లీ తిరిగి జట్టులోకి రానున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: