అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ... నవంబర్ 14వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది. ఫైనల్ మ్యాచ్కు దుబాయి ఇంటర్ నేషనల్ స్టేడియం వేదిక కానుంది. ఐపీఎల్ ముగిసిన రెండు రోజులకే ఈ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే తాజాగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ ఓ లేఖ రాసింది. నవంబర్ 14వ తేదీన జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కోసం దుబాయ్ ఇంటర్ నేషనల్ స్టేడియంలోనికి ప్రేక్షకులను అనుమతించాలని లేఖలో కోరింది. కనీసం 25 వేల మందిని అనుమతించాలని కోరింది. ఇందుకోసం యూఏఈ ప్రభుత్వానికి కూడా బీసీసీఐ లేఖ రాసింది. అనుకూలంగానే నిర్ణయం వస్తుందని బీసీసీఐ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం దుబాయ్లో కరోనా వైరస్ పూర్తి కంట్రోల్లో ఉంది. అదే సమయంలో వ్యాక్సినేషన్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. నిబంధనలు పాటిస్తూ..... రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిని ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీకి అనుమతిస్తున్నారు. అలాగే 16 ఏళ్ల వయసు నిండిన వారికే పర్మిషన్ ఇస్తున్నారు. అలాగే ఆర్టీ పీసీఆర్ టెస్టులో నెగటివ్ రిపోర్డు కూడా తప్పనిసరి. ఇవే నియమాలను ఫైనల్ మ్యాచ్ కోసం కూడా అమలు చేస్తూ... 25 వేల మందిని అనుమతించాలని బీసీసీఐ లేఖలో కోరింది.
అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ... నవంబర్ 14వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది. ఫైనల్ మ్యాచ్కు దుబాయి ఇంటర్ నేషనల్ స్టేడియం వేదిక కానుంది. ఐపీఎల్ ముగిసిన రెండు రోజులకే ఈ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే తాజాగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ ఓ లేఖ రాసింది. నవంబర్ 14వ తేదీన జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కోసం దుబాయ్ ఇంటర్ నేషనల్ స్టేడియంలోనికి ప్రేక్షకులను అనుమతించాలని లేఖలో కోరింది. కనీసం 25 వేల మందిని అనుమతించాలని కోరింది. ఇందుకోసం యూఏఈ ప్రభుత్వానికి కూడా బీసీసీఐ లేఖ రాసింది. అనుకూలంగానే నిర్ణయం వస్తుందని బీసీసీఐ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం దుబాయ్లో కరోనా వైరస్ పూర్తి కంట్రోల్లో ఉంది. అదే సమయంలో వ్యాక్సినేషన్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. నిబంధనలు పాటిస్తూ..... రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిని ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీకి అనుమతిస్తున్నారు. అలాగే 16 ఏళ్ల వయసు నిండిన వారికే పర్మిషన్ ఇస్తున్నారు. అలాగే ఆర్టీ పీసీఆర్ టెస్టులో నెగటివ్ రిపోర్డు కూడా తప్పనిసరి. ఇవే నియమాలను ఫైనల్ మ్యాచ్ కోసం కూడా అమలు చేస్తూ... 25 వేల మందిని అనుమతించాలని బీసీసీఐ లేఖలో కోరింది.