ఇందుకు ప్రధాన కారణం... ఈ రెండు జట్లు కూడా ఐసీసీ ఈవెంట్ లలో తప్ప ఏ విధమైన ద్వైపాక్షిక సిరీస్ లు కానీ, లేదా త్రైపాక్షిక సిరీస్ లలో కానీ తలపడకపోవడమే. అంతే కాకుండా లాస్ట్ టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ చేతిలో ఘోరంగా ఓడిపోవడం కూడా ఒక కారణం అని చెప్పాలి. అందుకే ఈ సారి ఎలాగైనా ఇండియా పాకిస్తాన్ ను ఓడించాలి అన్న పట్టుదలతో ఉంది. కానీ ఈ సారి పాకిస్తాన్ కు అంత సీన్ లేదని కొందరు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే... పాకిస్తాన్ ప్రస్తుతం అంత బలంగా లేదని చెప్పాలి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే... రీసెంటుగా ముగిసిన నెదర్లాండ్ సిరీస్ లో తమ స్థాయికి తగిన విధంగా ప్రదర్శన లేకపోవడమే.
ముఖ్యంగా ఈ సిరీస్ లో నెదర్లాండ్ ఆఖరి మ్యాచ్ లో దాదాపుగా పాకిస్తాన్ ను ఓడించినంత పని చేసింది. జట్టు మొత్తంలో చూస్తే ఒక్క బాబర్ ఆజామ్ తప్పించి మిగిలిన ఏ ఒక్క ఆటగాడు కూడా ఫామ్ లో లేకపోవడం చూస్తే ఈసారి పాకిస్తాన్ కు ఇండియా ను ఓడించలేదు అని అప్పుడే కంఫర్మ్ అయిపోతున్నారు. మరి ఏమి జరుగుతుంది అన్నది తెలియాలంటే వచ్చే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి