గత కొన్ని రోజులు నుంచి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టి20 ప్రపంచ కప్ కోసం వెయ్యికళ్లతో ఎదురు చూసారు అని చెప్పాలి. ఇక ప్రపంచకప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతుందని భావించారు. ఈ క్రమంలోనే అందరూ అనుకున్నట్లుగానే అటు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ నేటితో ప్రారంభమైంది. ఇక మొదటి మ్యాచ్ లోనే అటు ప్రేక్షకులందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 కాగా నేటి నుంచి అటు వరల్డ్ కప్ ప్రారంభం కాగా నేడు మొదటి మ్యాచ్లో శ్రీలంక-  నమీబియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఎవరైనా సరే పసికున నమీబియా పై అటు శ్రీలంక జట్టు ఎంతో అలవోకగా విజయం సాధిస్తుంది అని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మ్యాచ్లో పూర్తి అధిపత్యాన్ని ప్రదర్శించి ఇక వరల్డ్ కప్ లో మొదటి విజయాన్ని సాధించిన జట్టుగా శ్రీలంక రికార్డ్స్ సృష్టిస్తుంది అని అందరూ అనుకుంటారు. కానీ ఇటీవల జరిగిన మొదటి మ్యాచ్లో మాత్రం అందరూ ఊహించింది ఒకటి అక్కడ జరిగింది ఒకటి.


 ఇలా ప్రపంచకప్ తొలి మ్యాచ్ లోనే సంచలనం నమోదయింది అని చెప్పాలి. శ్రీలంక జట్టుపై పసికూన నమీబియా ఏకంగా 55 పరుగులతో ఘనవిజయం సాధించడం గమనార్హం. ఈ మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా జట్టు నిర్మిత 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దింపిన శ్రీలంక జట్టు 108 పరుగులకు కుప్పకూలిపోయింది అని చెప్పాలి. దీంతో 50 పరుగుల తేడాతో అటు శ్రీలంక జట్టుపై పసికూన నమీబియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది అని చెప్పాలి. నమీబియా విజయం సాధించడంతో ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. మొదటి మ్యాచ్ పైసా వసూల్ మ్యాచ్ గా మారిందని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: