టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు అటు భారత క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఎన్నో ఏళ్ల పాటు మూడవ స్థానంలో బ్యాటింగ్కు  దిగుతూ తన హవా నడిపించాడు సురేష్ రైనా. ఇక అద్భుతమైన బ్యాటింగ్ తో ఎన్నోసార్లు టీమ్ ఇండియాకు విజయాలను అందించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు  ముఖ్యంగా ధోనీకి మంచి స్నేహితుడిగా అటు టీమ్ ఇండియాలో తరచూ చోటు సంపాదించుకున్నాడు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత మాత్రం ఇక సురేష్ రైనాకు భారత జట్టులో చోటు లేకుండా పోయింది అని చెప్పాలి.


 అయినప్పటికీ మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీలో అటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలోనే తనదైన బ్యాటింగ్ తీరుతో మిస్టర్ ఐపీఎల్ గా కూడా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇక ఇటీవల సురేష్ రైనా అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే సురేష్ రైనాను కామెంటేటర్ గా చూడవచ్చు అని అభిమానులు అందరూ భావించారు. కానీ మరోసారి క్రికెటర్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు సురేష్ రైనా. భారత క్రికెట్లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్న క్రికెటర్  ఇతర దేశాల లీగ్లలో ఆడేందుకు రూల్స్ ప్రకారం అవకాశం ఉంటుంది.



 ఈ క్రమంలోనే ఇప్పటికే అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా ఇక ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ని కొత్తగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు అన్నది తెలుస్తుంది. అబూదాభి టీ20 లీగ్ లో డెక్కన్ గ్లాడియేటర్స్ ఫ్రాంచైజీ తరఫున ఆడెందుకు సురేష్ రైనా ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది నవంబర్ 23వ తేదీ నుంచి ఈ లీగ్ ప్రారంభం కాబోతుంది అనిచెప్పాలి. అయితే గత రెండేళ్ల నుంచి బ్యాటింగ్కు దూరంగా ఉన్న సురేష్ రైనా మరోసారి మైదానంలోకి దిగి సత్తా చాటెందుకు సిద్ధమవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: