చైనా నుండి కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా పాకిపోయిన తర్వాత క్రికెట్ ప్రపంచం మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు ద్వైపాక్షిక సిరీస్లు, మెగాటోర్నీలు అంటూ బిజీ బిజీగా ఉండే ఆటగాళ్లు అందరూ కూడా ఇక కరోనా వైరస్ కారణంగా కొన్ని నెలలపాటు ఇంటికే పరిమితం కావలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇక తర్వాత కాస్త కరోనా వైరస్ ప్రభావం తగ్గిన సమయంలో మ్యాచులు నిర్వహించినప్పటికీ ఇక ఎన్నో జాగ్రత్తలు మధ్య నిర్వహించారు. మెగాటోర్నీలకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక ఇప్పుడు కరోనా వైరస్ పరిస్థితులు సద్దుమనగడంతో అందరూ కూడా ఇక నిబంధనలు పక్కన పెట్టేసి టోర్నీలు ఆడటం చేస్తూ ఉన్నారు.


 అయితే ఈ ఏడాది ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. అయితే ఈ రెండు మెగా టోర్నీలపై మరోసారి కరోనా ప్రభావం చూపబోతుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం అవును అని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ప్రస్తుతం ఆసియా కప్ కు పాకిస్తాన్, శ్రీలంక దేశాలు ఆతిధ్యం ఇవ్వబోతున్నాయి. ఆగస్టు 30వ తేదీ నుంచి టోర్నీ ప్రారంభమవుతుంది. ఫైనల్ సెప్టెంబర్ 17వ తేదీన జరుగుతుంది అని చెప్పాలి. అయితే శ్రీలంక వేదికగానే భారత్, పాకిస్తాన్ మధ్య కీలకమైన మ్యాచ్ కూడా జరగబోతుంది.


 ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఒక పెద్ద వార్త బయటకు వచ్చింది. ఇది క్రికెట్ లవర్స్ అందరిని కూడా ఆందోళనకు గురిచేస్తుంది. ఆసియా కప్ ప్రారంభానికి ఐదు రోజుల ముందు శ్రీలంక శిబిరం నుంచి ఒక పెద్ద వార్త బయటకి వచ్చింది. ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకిందట. అవిష్క ఫెర్నాండో, కుశాల్ పెరీరా ఇలా వైరస్ బారిన పడ్డారట. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే ఇద్దరు ప్లేయర్స్ కరోనా వైరస్ బారిన పడితే ఇక టోర్నీ ప్రారంభమయ్యాక స్టేడియం నిండా ప్రేక్షకులను నిండిపోయాక.. వైరస్ వ్యాప్తి ఎంత ఉంటుందో అని అందరు భయపడిపోతున్నారు. ఇలా అయితే టోర్నీ సవ్యంగా నిర్వహించడం కష్టమే అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: