ఈ క్రమంలోనే పటిష్టమైన టీం తో బరిలోకి దిగేందుకు రెడీ అవుతుంది అని చెప్పాలి. అయితే ఇక వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయబోయే జట్టులో ఎవరు ఉంటే బాగుంటుంది అనే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఎన్నో రోజుల నుంచి రివ్యూల మీద రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ లో రాణిస్తున్న కొంతమంది ఆటగాళ్ళను తప్పకుండా వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవాలి అంటూ సూచనలు కూడా చేస్తూ ఉన్నారు మాజీ ఆటగాళ్లు. ఈ క్రమంలోని ఇదే విషయం గురించి వెస్టిండీస్ దిగజం బ్రియాన్ లారా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 ప్రపంచ కప్ టోర్నీలో సంజు శాంసన్, రిషబ్ పంతులు ఇద్దరు కూడా టీమిండియాలో ఉండాల్సిందే అంటూ అభిప్రాయపడ్డాడు లారా. కీపింగ్ కు భారత జట్టులో పోటీ ఎక్కువగా ఉన్న కారణంగా కేవలం ఒకరిని ఎంపిక చేయాలా అనే ప్రశ్నపై స్పందించిన లారా ఆసక్తికర సమాధానం చెప్పాడు. వాళ్ళిద్దరిలో ఒకరిని కాదు ఇద్దరినీ కూడా జట్టులోకి తీసుకోవాలి. ఈ ఐపిఎల్ సీజన్లో వాళ్ళిద్దరూ కూడా అద్భుతంగా ఆడుతున్నారు. సంజూ టైమింగ్ రిషబ్ పంత్ ఫామ్ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అంటూ లారా చెప్పుకొచ్చారు.