అలాగే ఇక ‘నయే ఇండియా కా నయా జోష్’ పేరుతో జియో సరికొత్త ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్లాన్స్ రూ. 399 నుంచి ప్రారంభమవుతాయి. అపరిమితంగా డేటా వాడుకోవచ్చు. అంతేకాకుండా 150 ఎంబీపీఎస్ స్పీడ్తో 30 రోజుల ఉచిత ట్రయల్ కూడా ఆఫర్ చేస్తోంది. 4కే సెట్ టాప్ బాక్స్ ఉచితంగా అందిస్తోంది. కొత్త యూజర్లకు 10 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ ఉచితం. 30 రోజుల ఫ్రీ ట్రయల్లో భాగంగా 10 ఓటీటీ యాప్స్ యాక్సెస్ చేయొచ్చు. వాయిస్ కాలింగ్ ఉచితం. ఒకవేళ 30 రోజుల్లో సర్వీస్ నచ్చకపోతే కనెక్షన్ వద్దని చెప్పొచ్చు. ఎలాంటి కండీషన్స్ ఉండవు. ఈ 30 రోజుల ఫ్రీ ట్రయల్ కొత్త కస్టమర్లకు మాత్రమే. ఇప్పటికే జియో ఫైబర్ కస్టమర్లుగా ఉన్నవారికి కూడా లాయల్టీ బెనిఫిట్స్ లభిస్తాయి. కొత్త టారిఫ్ ప్లాన్స్ ప్రకారం ప్రస్తుత కస్టమర్లను అప్గ్రేడ్ చేసి ఆయా ప్రయోజనాలను అందిస్తారు.
జియో ఫైబర్ 4 కొత్త ప్లాన్ల వివరాలు...
రూ. 399 ప్లాన్: 30 ఎంబీపీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.
రూ. 699 ప్లాన్: 100 ఎంబీపీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.
రూ. 999 ప్లాన్: 150 ఎంబీపీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రూ.1,000 విలువైన 11 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం.
రూ. 1499 ప్లాన్: 300 ఎంబీపీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రూ.1,500 విలువైన 12 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం.