దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. 2019-2020 బోనస్‌ను ప్రకటించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది బోనస్‌ వస్తుందో, లేదో అని ఉద్యోగుల్లో అనుమానం ఉండేది. కానీ ప్రభుత్వం బుధవారం (అక్టోబర్ 21) ఈ బోనస్ శుభవార్త అందించడంతో.. ఉద్యోగుల ఇళ్లలో ఆనందం రెట్టింపయ్యింది.

సాధారణంగా ప్రతి సంవత్సరం దసరా పండుగకు ముందుగానే ప్రభుత్వం బోనస్‌ను ప్రకటించేది. అయితే.. ఈ ఏడాది పండుగ దగ్గర పడుతున్నా, బోనస్‌ ప్రకటించకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమైంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో 30.67 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం ప్రకటించిన బోనస్‌ విలువ రూ.3,737 కోట్లు అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడించారు. ప్రొడక్టివిటీ, నాన్-ప్రొడక్టివిటీ (ఉత్పాదక, ఉత్పాదకేతర) బోనస్‌ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: