ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.మన చుట్టూ ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాని కొన్ని ప్రమాదాలు చరిత్రలో గుర్తుండి పోతాయి. అవి చాలా భయంకరంగా జరుగుతాయి. ప్రస్తుతం ఈ ప్రమాదం కూడా చాలా భయంకరమైనది. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇండియా హెరాల్డ్ అందిస్తున్న వివరాల్లోకి వెళితే.... ప్యాసెంజర్లతో సియాన్-పాన్వెల్ హైవే మీద వెళ్తున్న ఓ బస్సు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది.



ముంబయి నుంచి సొల్హాపూర్‌ వైపు వెళ్తున్న ఈ బస్సులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు బస్సు నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ మంటల్లో ఓ ప్రయాణికుడు చిక్కుకున్నాడు. చివరికి అతడిని ప్రాణాలతో రక్షించారు. బస్సులోని బ్యాటరీలో షార్ట్‌ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఈ సమాచారం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది మంటలను అందుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పటికే  ఆ  బస్సు మంటల్లో బుగ్గయ్యింది. అయితే, ఈ ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదు. ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...






మరింత సమాచారం తెలుసుకోండి: