గర్భం అంటే గుర్తుకు వచ్చేది మహిళే. మహిళలకు వారి జీవితంలో గర్భం అనేది చాలా ముఖ్యమైనది. గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్త్రతగా ఉండాలి. గర్భిణీ మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. వారి కడుపులో గల శిశువు కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు గురికాకుండా ఉంటుంది. అయితే చాల మంది జ్వరం, ఒళ్లునొప్పులుగా అనిపిస్తే వెంటనే పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటాం. కానీ ప్రెగ్నెన్సీ టైంలో పారాసిటమాల్ వాడొద్దని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఈ మాత్ర ప్రభావం వల్ల పుట్టబోయే ఆడబిడ్డలో సంతాన సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. పాప పెరిగి పెద్దయ్యాక... పునరుత్పత్తి మీద దాని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. పారాసిటమాల్, ఎసిటమినోఫెన్ లాంటి ట్యాబెట్లను ప్రపంచ వ్యాప్తంగా గర్భిణులు కామన్‌గా వాడుతున్నారు. పునరుత్పత్తి కోసం పరిమిత సంఖ్యలో మాత్రమే ఆడవారిలో అండాలు ఉత్పత్తి అవుతాయి. పుట్టుకతోనే మనుషులు, ఎలుకల్లో అండాల సంఖ్య విషయంలో పరిమితి ఉంటుంది. గర్భిణులు నొప్పి నుంచి ఉపశమనం కోసం పారాసిటమాల్ మాత్రలు తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డలో అండాల సంఖ్య తగ్గుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

దీని ఫలితంగా యుక్త వయసులోకి వచ్చాక వారిలో సంతానోత్పత్తి కోసం కొన్ని అండాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీని వల్ల పునరుత్పత్తి అవకాశాలు తగ్గుతాయి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య అధికం అవుతుంది. గర్భిణులపై పారాసిటమాల్ ప్రభావంపై మూడు ల్యాబోరేటరీల్లో పరిశోధనలు చేపట్టారు. ఈ విషయమై మరింత లోతుగా రీసెర్చే చేయాల్సిన అవసరం ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన క్రిస్టెన్‌సేన్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: