మహారాష్ట్రలో ఇటీవల శివసేన- అఘాడీ సర్కారు కుప్పుకూలిన సంగతి తెలిసిందే. శివసేన అధ్యక్షుడు ఠాక్రే పార్టీపై పట్టుకోల్పోగా.. అనూహ్యంగా అదే పార్టీ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే పార్టీని హైజాక్‌ చేసి బీజేపీతో చేతులు కలిపారు. ఏకంగా సర్కారును కూల్చి తాను సీఎం అయ్యాడు. అయితే.. దీనికి స్క్రీన్‌ప్లే అంతా బీజేపీదేనన్న విమర్శలు ఉన్నాయి.


అయితే.. ఇప్పుడు మహారాష్ట్ర సీన్‌ ఏపీలోనూ పునరావృతం అవుందంటున్నారు కొందరు టీడీపీ నేతలు.. జగన్‌ ఆ భయంతోనే తల్లి చేత రాజీనామా చేయించి కన్న తల్లి చేత కన్నీళ్లు పెట్టించి సభ నుంచి పంపించాడని విమర్శిస్తున్నారు. మహారాష్ట్రలో జరగబోయేది ఇక్కడ జరగబోతుందంటున్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. జగన్ను ఎప్పటికైనా గద్దెదించి పెద్దిరెడ్డి గద్దెనెక్కుతాడనే జగన్‌కు భయం పట్టుకుందని ఆయన విమర్శించారు. టీడీపీ వాళ్లు అంటున్నారు కానీ.. అంత సీన్ ఉందా.. పార్టీలో జగన్ ను కాదని పార్టీని హైజాక్‌ చేసే సీన్ మాత్రం ఇప్పటికి కనిపించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: