దిశ లాంటి దారుణ సంఘ‌ట‌న‌ల త‌ర్వాత హంత‌కుల‌ను దారుణంగా ఎన్‌కౌంట‌ర్ చేసి ప‌డేసినా కూడా కామాంధులు, మృగాళ్ల‌లో మార్పులు రావ‌డం లేదు. ఇక తెలంగాణ‌లో గ‌త రెండేళ్ల‌లో ఎన్నో హ‌త్యాచారాలు.. హ‌త్య‌లు జ‌రిగాయి. తాజాగా నాగ‌ర్ క‌ర్నూల్లో ఓ ఇంట‌ర్ విద్యార్థిని హ‌త్య‌కు గురైంది. ఆమెపై హ‌త్యాచారం చేసి హ‌త్య చేసి ఉంటార‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అమ్మాయిని హ‌త్య చేసిన దండుగులు ఆమె మృత‌దేహాన్ని పెబ్బేరు ఆసుప‌త్రి వ‌ద్ద వ‌దిలి వెళ్లారు.

 

ఆమెపై మృగాళ్లు హ‌త్య చేశాకే... హ‌త్య చేసి ఉంటార‌న్న సందేహాల‌ను పోలీసులు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే విచార‌ణ‌లో సాయికృష్ణ అనే యువ‌కుడితో పాటు అత‌డికి స‌న్నిహితంగా ఉన్న కొంద‌రు యువ‌కుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దోషుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని బాల‌ల హ‌క్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: