ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లిక్కర్ హాట్ టాపిక్ గా మారింది. లాక్ డౌన్ కారణంగా ఎండిన నాలుకలు మద్యంతో తడిచాయి. నిన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో వైన్ షాపులు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. ప్రతి బార్ వెంట మందు బాబులు బారులు తీరారు. అయితే మందు బాబులకు ఈ వాతావరణం ఓ పండగ లా తలపించింది. అయితే వైన్ షాపులకు పెర్మిషన్ ఇవ్వడం పై పలువురు మండిపడుతున్నారు.  అయితే ఈ మందు బాబులపై యాంకర్ రష్మీ గౌతమ్ కూడా హాట్ కామెంట్స్ చేశారు .

IHG

అయితే ఈ అమ్మడు చేసిన హాట్ కామెంట్ తో సోషల్ మీడియా ఒక్క సారిగా ఉలిక్కిపడింది. అయితే వైన్ షాపులకు అనుమతులు ఇవ్వడం పై ఈ అమ్మడు ఘాటుగా స్పందించింది. ఉచితంగా ప్రభుత్వ పథకాలు పొందుతున్న ఈ పేద ప్రజలు ఎలా మందు తాగడానికి డబ్బులు సర్దుబాటు చేసుకోగలుగుతున్నారని ఆమె దుయ్యబట్టింది . అయితే ఈ సందర్భంగా ఆమె వైన్ షాప్ కి వస్తున్నా ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్నప్పుడు ఎలా ఇన్క్ వేస్తారో అలానే వీరికుడా ఇన్క్ వేయాలి . తద్వారా వీరికి ప్రభుత్వ పథకాలు పొందే వీలు లేకుండా చేయాలనీ ఆమె పేర్కొన్నారు. అయితే వైన్ కి డబ్బులు సర్దుబాటు చేసుకోగలిగినప్పు వారు ప్రభుత్వ ఉచిత పథకాలు పొందటానికి వారు అనర్హులు అని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించింది .

 

మరింత సమాచారం తెలుసుకోండి: