కరోనా తో పోరాడుతున్న భారత్ కి అమెరికా వెంటిలేటర్లను విరాళం గా ఇవ్వడం పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ మేరకు మోడీ ట్రంప్ కి ధన్యవాదాలు చెప్పారు. ఈ సమయంలో మీ సాయం చాలా గొప్పది అంటూ మోడీ ట్రంప్ ని ఉద్దేశించి కొనియాడారు.
అధ్యక్షుడు ట్రంప్ కు ధన్యవాదాలు. ఈ మహమ్మారి మనందరితో సమిష్టిగా పోరాడుతోంది. అటువంటి సమయాల్లో, దేశాలు కలిసి పనిచేయడం మరియు మన ప్రపంచాన్ని ఆరోగ్యంగా మరియు కరోనా నుండి విముక్తి కలిగించడానికి వీలైనంత వరకు చేయడం ఎల్లప్పుడూ ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. భారతదేశం-యునైటెడ్ స్టేట్స్ స్నేహానికి మరింత శక్తి అందింది అంటూ మోడీ పేర్కొన్నారు. కాగా ట్రంప్ వెంటిలేటర్లు ఇస్తున్నట్టు రాత్రి ప్రకటించారు.
Thank you, President Trump. This pandemic is being fought collectively by all of us. In such times, it’s always important for nations to work together & do as much as possible to make our world healthier & free from #COVID19. More power to India-United States friendship: PM modi https://t.co/baryGZmm8k pic.twitter.com/EvZY5MXZ5U
— ANI (@ANI) May 16, 2020