ఒక పక్క దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్నా సరే పాకిస్తాన్ వైఖరి లో మాత్రం మార్పు రావడం లేదు. తన కుట్రలను ఏ విధంగా కూడా పాకిస్తాన్ ఆపడం లేదు. ఏదోక రూపంలో భారత్ మీద కక్ష సాధింపు చర్యలకు పాకిస్తాన్ దిగుతూనే ఉంది. ఒక పక్కన ఉగ్రవాదులను భారత్ లోకి పంపించడమే కాదు... దాడులకు కూడా దిగుతూనే ఉంది. 

 

సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులకు దిగుతుంది. జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు తెల్లవారుజామున  పూంచ్‌ జిల్లా లోని బాలకోట్ సెక్టార్‌లో పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ కాల్పులకు దిగింది. తేలికపాటి ఆయుధాలతో దాడులు చేసింది పాకిస్తాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: