ఝార్ఖండ్ లో మావోలు ఇప్పుడు పోలీసుల మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇటీవల ఇద్దరు మావోలను పోలీసు బలగాలు కాల్పుల్లో కాల్చి చంపాయి. దీనితో మావోలు ఇప్పుడు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక అటవీ ప్రాంతాల్లో మావోలు కాస్త ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనే చెప్పవచ్చు. ఇది పక్కన పెడితే తాజాగా అక్కడ పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. 

 

కరైకేలా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక పోలీసు బృందంపై నక్సల్స్ కాల్పులు జరపడంతో ఒక పోలీస్ కానిస్టేబుల్ మరియు ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. నక్సల్స్ ఒక పౌరుడి ఇంట్లో దాక్కున్నారని పోలీసులు వెల్లడించారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఇంద్రజీత్ మహాతా అనే... పోలీస్ సూపరింటెండెంట్  వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: