తెలంగాణా రాష్ట్రంలో ఆవిర్భావ వేడుకలు చాలా వరకు నిరాడంభరంగా ఏ విధంగా కూడా హడావుడి లేకుండా చేస్తున్నారు. ఈ తరుణంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించేందుకు గన్‌పార్క్‌కు వెళ్ళారు తెలంగాణా సిఎం కేసీఆర్. 

 

ఈ సమయంలో సీఎం కార్ డోర్ దగ్గరకు వెళ్లిన ఒక నిరుద్యోగి తనకు ఉద్యోగం ఇవ్వాలని ఆయనను డిమాండ్ చేయడం చూసి అక్కడ ఉన్న వారు షాక్ అయ్యారు. వెంటనే అతన్ని అక్కడి సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసీఆర్ భద్రతా సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అంత దగ్గర వరకు వస్తుంటే ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: