తూర్పు గోదావరి జిల్లా ఎన్ కొత్తపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉద్యోగం కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఈ ఘటనలో ముగ్గురుకి తీవ్ర గాయాలు కావడంతో వారిని కాకినాడ జీజీహెచ్ కి అధికారులు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. 

 

వారించే ప్రయత్నం  చేసినా సరే ఈ దాడి మాత్రం ఆగలేదు. ఈ ఘటనలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసారు పోలీసులు. గాయపడిన వారిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: