ఒడిశా రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే మధన్‌ మోహన్‌ దత్తా ఈరోజు గుండెపోటుతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన ఈరోజు ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయస్సు 62 సంవత్సరాలు. ఆయన గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో కూడా బాధ పడుతున్నాడని సమాచారం. 
 
ఒడిషాలోని బాలాసోర్‌ నియోజకవర్గం నుంచి మధన్‌ మోహన్‌ దత్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మరణవార్త తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రతాప్ సారంగి ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్యే మరణంతో బీజేపీ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: