దేశ వ్యాప్తంగా కరోనా కేసులు బారీగా నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కరోనా కేసులు వేగంగా నమోదు అవడంతో ఇప్పుడు రాష్ట్రాలు కూడా కాస్త ఆందోళనలో ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీలో కోరనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో దాదాపు కొన్ని నగరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనధికారిక లాక్ డౌన్ ని ప్రకటించింది. 

 

విజయవాడ సహా గుంటూరు, కర్నూలు, అనంతపురం ఇలాంటి ప్రాంతాల్లో అనధికారిక లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు.  అదే విధంగా కడప నగరం లో కూడా కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో అక్కడ కూడా అనధికారిక లాక్ డౌన్ ని విధించే అవకాశం ఉంది. కృష్ణా జిల్లాలో కొన్ని పట్టణాలు లాక్ డౌన్ లోనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: