గత 20 రోజుల నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత అనేది చాలా వేగంగా జరుగుతుంది. రోజు రోజుకి కూడా ఎక్కడో ఒక చోట కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులను భారత బలగాలు కాల్చి చంపుతూనే ఉన్నాయి. నేడు కూడా సౌత్ కాశ్మీర్ లో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని భారత బలగాలు కాల్పులకు దిగాయి. 

 

ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మన బలగాలు కాల్చి చంపాయి. ఇక ఇదిలా ఉంటే పుల్వామా జిల్లా అవంతిపోరాలోని త్రాల్ ప్రాంతంలో చేవా ఉలార్ నుండి తుపాకీ కాల్పులు వినిపించాయి. జాతీయ మీడియా వెళ్ళగా అక్కడ కాల్పుల శబ్దం వినిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిన్న సాయంత్రం ఉగ్రవాదులు మరియు భద్రతా దళాల మధ్య కాల్పులు మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: