ఆంధ్రప్రదేశ్ లో అవినీతి విషయంలో ఏపీ సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అవినీతిని బయటకు తీస్తామని ఏ విధంగా అయితే సిఎం జగన్ ప్రకటించారో ఆ విధంగానే ఏపీలో అవినీతిని టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ నేతలు చేసిన అవినీతి ని బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే... 

 

తప్పుచేసిన వారిని ప్రభుత్వం విడిచిపెట్టదని  మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ స్పష్టం చేసారు. ఫైబర్ గ్రిడ్‌లో మాజీ మంత్రి లోకేష్‌ అవినీతి త్వరలో బయటపడుతుందని ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబం ఇసుకలో అవినీతి చేసిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని  ఆయన సవాల్ చేసారు. ఐదేళ్లలో టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్‌ అనేక తప్పులు చేశారని, వారి చర్యల వల్ల మంత్రులుగా పనిచేసినవారు జైలుకు వెళ్తున్నారని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: