ఆంధ్రప్రదేశ్ లో 108 వాహనాలను ప్రారంభించడం పై మంత్రులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను చెప్తున్నారు. 108 చరిత్రలోనే ఇదో గొప్ప అధ్యాయం కావడం తో ఇప్పుడు సోషల్ మీడియాలో వారు తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. సిఎం జగన్ కూడా దీనిపై ఎంతో హర్షం వ్యక్తం చేసారు.
తాజాగా జలవనరుల శాఖా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే అపర సంజీవని 108 & 104 అంబులెన్సులను ప్రారంభించిన వైఎస్ జగన్ అన్న అంటూ ఆయన ట్వీట్ చేసారు. దేశం మొత్తం కని విని ఎరుగని విధంగా ఒకే సారి 1088 అత్యాధునిక అంబులెన్సులతో ప్రారంభమని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.
అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే అపర సంజీవని 108 & 104 అంబులెన్సులను ప్రారంభించిన @ysjagan అన్న. దేశం మొత్తం కని విని ఎరుగని విధంగా ఒకే సారి 1088 అత్యాధునిక అంబులెన్సులతో ప్రారంభం.#108Ambulance #104Sevices pic.twitter.com/G9nrgznXn6
— Dr.Anil Kumar Yadav (@AKYOnline) July 1, 2020