ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ఇటు మన సైనికా దళాలను కూడా వదలడం లేదు. భద్రతా దళాల్లో కరోనా మహమ్మారి భారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బీఎస్ఎఫ్లో ఇప్పటికే 1500 మందికిపైగా జవాన్లు కరోనా భారీన పడగా.. ఇప్పుడు మరో 73 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో బీఎస్ఎఫ్లో మొత్తం బాధితుల సంఖ్య 1,659కి పెరిగింది. బోర్డర్లోనే ఇంత మందికి సైనికులకు కరోనా సోకడంతో భద్రతా దళాల్లో తీవ్ర ఆందోళన కలుగుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా, 14 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఈ వైరస్ భారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 927కు పెరిగింది. మరోవైపు, ఇండో టిబెటిన్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)లోనూ కొత్తగా 12 మందికి వైరస్ సోకగా, 12 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఫోర్స్లో ఇంకా 178 కేసులు యాక్టివ్గా ఉండగా, 298 మంది కోలుకున్నట్టు ఐటీబీపీ వర్గాలు తెలిపాయి.