తెరాస అగ్ర నేత, మాజీ హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి కరోనాతో పోరాడుతున్నారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన కరోనా నుంచి కోలుకున్నట్టే కోలుకుని మళ్ళీ అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం ఆయనకు అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్ మీద వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఊపిరి తిత్తులలో ఇన్ఫెక్షన్ పెరుగుతున్న నేపధ్యంలో ఆయనను అపోలోకి తరలించారు.

ఇక ఆయన అల్లుడుకి కూడా కరోనా సోకింది అని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని అధికారులు వివరించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గురించి ఏమీ చెప్పలేము అని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం శ్వాస తీసుకోవడానికి ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు అని అధికారులు పేర్కొన్నారు.  కాగా ఆయన తెలంగాణా ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పని చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: