మహాబూబాద్  లో గత ఆదివారం కిడ్నాప్ అయిన  బాలుడు దీక్షిత్ రెడ్డిని కిడ్నాపర్లు చంపేశారు. ఆదివారం రాత్రి బాలుడు కిడ్నాప్ అయ్యాడు. అక్కడి నుంచి బాలుడి తల్లి తండ్రులకు వరుసగా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. బంధువులు మనోజ్ రెడ్డి, సాగర్ మీద  పోలీసులు అనుమానం వ్యక్తం చేసారు. కిడ్నాపర్లను గుర్తించడానికి పోలీసులు  వంద మంది రంగంలోకి దిగారు.

అయినా సరే బాలుడి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇంటర్నెట్ కాల్స్ చేయడంతో నిందితులను గుర్తించడం కష్టంగా మారింది. మానుకోట కు ఐదు కిలోమీటర్ల దూరంలో దీక్షిత్ రెడ్డి మృతదేహం లభ్యం అయింది. శనగ పురం గుట్టల్లో బాలుడు మర్డర్ జరిగింది. అక్కడే బాలుడు దీక్షిత్ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. తీసుకుని వెళ్లిన రోజే దీక్షిత్ ను హత్య చేసారు.  బాలుడికి మత్తు మందు  ఇచ్చి దారుణంగా హత్య చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: