మహబూబాద్ లో బాలుడు దీక్షిత్ ని కిడ్నాప్ కిడ్నాప్ చేసి చంపేసిన నిందితులను కాల్చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. వారిని ఎన్కౌంటర్ చేసినట్టుగా  వార్తలు వస్తున్నాయి. ఒక యాప్ ద్వారా ఇంటర్నెట్ కాల్ చేసిన నలుగురు నిందితులు తెలంగాణా పోలీసులను నాలుగు రోజులుగా ఇబ్బంది పెడుతున్నారు. కిడ్నాపర్లను  కాసేపటి క్రితం పోలీసులు కాల్చి చంపారని అంటున్నారు.

దీక్షిత్ ని ఆదివారం రాత్రి ఆడుకుంటున్న సమయంలో కిడ్నాప్ చేసారు. ఆ తర్వాత 2 గంటల్లోనే బాలుడుని చంపేసి దహనం చేసారు. మానుకోట వద్ద ఉన్న గుట్టల్లో పోలీసులు బాలుడి  మృతదేహాన్ని గుర్తించారు. మహబూబాబాద్ శివారుల్లో బాలుడి మృతదేహం గుర్తించారు.  వంద మంది పోలీసులు వారి కోసం నాలుగు రోజుల నుంచి గాలిస్తున్నారు. బంధువులు మనోజ్ రెడ్డి, సాగర్ పైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ కాల్స్ పోలీసులు ట్రేస్ చేయలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: