రాజేంద్ర నగర్ సర్కిల్ గగన్ పహాడ్ అప్ప చెరువు తెగి వరదల్లో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ. మృతుల కుటుంబాలకు టీడీపీ తరపున 10000  రూపాయల చొప్పున ఆర్థిక సాయం  అందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అనేక మంది వరదల్లో మునిగి మృతిచెందారు అని ఆయన మండిపడ్డారు.  వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించినా ప్రభుత్వం అధికారులను , ప్రజలను అప్రమత్తం చేయలేదని ఆయన ఆరోపించారు.

హైదరాబాద్ నగరంలోని అన్ని చెరువులకు మరమ్మతులు చేస్తామని , నాళాలను విస్తరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టలేదు అని మండిపడ్డారు. గత జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. 30000 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన టీఆరెస్ పార్టీ హామీలను విస్మరించింది అని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: