హైదరాబాద్ లో వర్షాలు సృష్టించిన విలయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షాల దెబ్బకు హైదరాబాద్ కకావికలం అయిపోయింది. ఇక కేంద్ర ప్రభుత్వ బృందం హైదరాబాద్ లో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటుంది. నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో రెండు రోజు... కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నాయకత్వం లో, కేంద్ర జలవనరుల విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం రఘురామ్, కేంద్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ కె కుష్వారాలతో కూడిన బృందం పర్యటిస్తుంది.

నాగోల్, బండ్లగూడ చెరువుల నుండి  ఓవర్ ఫ్లో అవ్వడం ద్వారా... నాలాలులోకి వస్తున్న, వరద నీరు, వరద ముంపుతో జరిగిన నష్టం గురించి అధికారులు, అక్కడి స్థానిక ప్రజల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎల్బీ నగర్ జోన్ హయత్ నగర్ సర్కిల్  నాగోల్ రాజరాజేశ్వరి కాలనీ సహా పలు ప్రాంతాల్లో  కేంద్ర బృందం పర్యటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: