రాజస్థాన్​ రాయల్స్​ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​పై ఎనిమిది వికెట్ల ​తేడాతో ఘన విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాయల్స్​.. 18.2ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్టోక్స్​(107) అర్ధశతకంతో మెరవగా, సంజూ శాంసన్​(54) అర్థ శతకం బాది విజయంలో కీలక పాత్ర పోషించారు. మిగతా వారు విఫలమయ్యారు. ఈ విజయంతో ప్లేఆఫ్స్​ ఆశల్ని సజీవం చేసుకున్నట్లే. ముంబయి బౌలర్లలో జేమ్స్​ ప్యాటిన్స్​న్​ రెండు వికెట్లు తీశాడు.



అంతకముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ చేసిన ముంబయి...రాజస్థాన్‌ ముందు 196 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసినా హార్దిక్‌ పాండ్య (60*; 21 బంతుల్లో 2×4, 7×6) సూర్యకుమార్‌ యాదవ్‌ (40; 26 బంతుల్లో 4×4, 1×6), ఇషాన్‌ కిషన్‌ (37; 36 బంతుల్లో 4×4, 1×6), సౌరభ్‌ తివారి (33*; 23 బంతుల్లో 4×4, 1×6) బ్యాటింగ్‌లో రాణించారు. రాజస్థాన్​ బౌలర్లలో శ్రేయస్​ గోపాల్​(2), జోఫ్రా ఆర్చర్​(2), కార్తీక్​ త్యాగీ (1) వికెట్​ తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: