ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లోని కన్నౌజ్ అమోలార్ గ్రామంలో  ఒక ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్ ని డీ కొనడంతో కారు బోల్తా పడి ఏడుగురు సాధువులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో టైర్ పేలింది అని అందుకే ఘటన జరిగింది అని అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులందరిని స్థానిక ఆస్పత్రుల్లో జాయిన్ చేసామని అధికారులు వివరించారు. గంగా నదిలో పవిత్ర స్నానం చేయడానికి గానూ వారు రాజస్థాన్ నుంచి కారులో వస్తున్నారు.

అయితే ఈ ఘటన విషయంలో ఆ రాష్ట్ర సిఎం సిఎం యోగి ఆదిత్య నాథ్ స్పందించారు. సిఎం యోగి ఆదిత్యనాథ్ ఈ సంఘటనను మీడియాలో చూసి వెంటనే ఉన్నతాధికారులను అక్కడికి చేరుకుని అవసరమైన అన్ని సహాయం అందించాలని ఆదేశించారని యుపి ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) ప్రకటన చేసింది. ఇప్పుడు వారిలో అందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది అని అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: