బీజేపీ అభ్యర్ది రఘునందన్ రావు మామా, బంధువుల ఇంటిపై పోలీసుల దాడి పై  ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.  ఈ ఘటనపై ఇప్పుడు బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపై, పోలీసుల తీరుపై ఫిర్యాదు చేసే యోచనలో అభ్యర్థి రఘునందన్ రావు ఉన్నారు. ఘటనపై ఈ ఎన్నికల సంఘానికి బిజెపి ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

దుబ్బాక ఎన్నికల సందర్బంగా జరుగుతున్న పరిణామాలపై బీజేపీ పెద్దలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి అడిగినట్టు తెలుస్తుంది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇటు అభ్యర్థి రఘునందన్ రావు కు ఫోన్ చేసి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆరా తీసారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై ఆరోపణల నేపథ్యంలో కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికలు జరపాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: