ఓటమి భయంతోనే టిఆర్ఎస్ ఇదంతా చెపిస్తున్నదని దుబ్బాక బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు అన్నారు. ముందుగా నోటిసులు ఇవ్వకుండా ఎలా సెర్చ్ చేస్తారు అని ఆయన ప్రశ్నించారు. వారికి మా వాళ్ళు సహకరించినా  భయబ్రాంతులకు గురి చేసేలా పోలీసుల తీరు ఉంది అని అన్నారు. నన్ను ప్రచారం చేసుకొనియకుండా అడుగడుగునా ఇలా అడ్డుపడుతున్నారు అని ఆయన విమర్శించారు.

పోలీసులే డబ్బులు పెట్టి నన్ను ఇబ్బందుల పాలు చేయాలనే కుట్రలు జరుగుతున్నాయన్నారు. నన్ను ఓడించాలనే లక్ష్యం తో హరీశ్ రావు ఇదంతా చేయిస్తున్నారని అన్నారు. నోటీసులు ఇవ్వలేదంటే తీరిగ్గా సాయంత్రం ఇచ్చారు, సెర్చ్ చేశాక పంచనామా ఇవ్వాలంటే అది ఇవ్వడం లేదని, నన్ను నా కుటుంబాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనుకుంటున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్దితో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: