సిద్దిపేట జిల్లా అప్పనపల్లి గ్రామంలో మంత్రి హరీష్ రావు, అభ్యర్థిని సోలిపేట సుజాత ఎన్నికల ప్రచారం చేసారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్నం అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతుకు రైతుబంధు ఇస్తున్నారా?  అని ఆయన ప్రశ్నించారు. రైతులు చనిపోతే అయిదు లక్షల బీమా ఇస్తున్నం అన్నారు.

1600 బిజెపి పార్టీ వాళ్ళు ఇస్తామని అంటున్నారు ఇస్తే నేను రాజీనామా చేస్తా లేకుంటే బిజెపి వాళ్లు ముక్కు నెలకు రాస్తార అని ఆయన సవాల్ చేసారు. కెసిఆర్ కిట్టు పైసలు మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వంవే అన్నారు. -మొన్న బిజెపి పార్టీ నాలబై లక్షలు దొరికినయ్ చీరలు దొరికినయ్ సిద్దిపేట పైసలు దొరకగానే కుర్దిలో పడ్డ ఎలుక తయారు అయ్యారు  అని ఆయన ఎద్దేవా చేసారు. అప్పనపల్లి గ్రామంలో కాలువకు భూములు కోల్పోయిన వారికి సిద్దిపేట లాగ నష్టపరిహారం ఇప్పిస్తా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చినం గోదావరి నీళ్ళతో కాళ్లు కడుగుతాం అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: