బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రెండవ దశ ప్రచారం కోసం దర్భాంగలోని రాజ్ మైదానంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. రాష్ట్రంలోని 71 సీట్లలో మొదటి దశ పోలింగ్ జరుగుతోంది. 'ఆత్మనిర్భార్ బీహార్' కోసం ఒక స్పష్టమైన పిలుపునిచ్చారు. స్వావలంబన బీహార్ లక్ష్యాన్ని సాధించడానికి 'ఆత్మనిర్భర్ మిథిలాంచల్' చాలా అవసరం అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష ఆర్జేడీ, మహాగట్ బందన్‌ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసారు.

బీహార్‌ లో జంగిల్ -రాజ్‌ను తీసుకువచ్చిన వారి పట్ల బీహార్ ప్రజలు జాగ్రత్త వహించాలని, చట్టవిరుద్ధం అనేది కొన్నేళ్లుగా ప్రబలంగా ఉందని అన్నారు. “బీహార్ ప్రజలు రాష్ట్రంలో 'జంగిల్ రాజ్' తీసుకువచ్చిన వారిని, బీహార్ ను దోచుకున్న వారిని మళ్లీ ఓడించాలని సంకల్పించారు.” అని మోడీ పేర్కొన్నారు. బీహార్ యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేలా సాఫ్ట్‌వేర్ పార్కులను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: