బీజేపీని విమర్శించే స్థాయి కల్వకుంట్ల కుటుంబానికి లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలసి హైదరాబాద్ లో అరాచకాలు సృష్టిస్తున్నాయి అని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్  మార్పు బీజేపీతోనే అని ప్రజలు నమ్ముతున్నారు  అని ఆయన వివరించారు. 67 వేల కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళాయో ప్రభుత్వం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు.

దేశంలోని 80 శాతం మున్సిపాలిటీల్లో  బీజేపీ పాలక వర్గాలున్న విషయం కేటీఆర్ గుర్తుంచుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. అరాచకాలను, విధ్వంసాలను బీజేపీ సమర్థించదు అని ఆయన స్పష్టం చేసారు. సచివాలయం లేని తెలంగాణ తమకొద్దని ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు. 12వందల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను  రెండు కుటుంబాల తన్నుకుపోయ్యాయి అని ఆయన విమర్శించారు.  గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని కోరుతున్నాను అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: