గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి విజయశాంతి ఆసక్తి చూపించడం లేదని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆమె రెండు పార్లమెంట్ స్థానాల్లో ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు. మొత్తం 30 డివిజన్ లలో ఆమె ప్రచారం చేయాలని బిజెపి అధిష్టానం సూచనలు చేసింది. ఈ 30 డివిజన్ లలో కూడా బిజెపి గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీనితో అక్కడ ప్రచారం చేయడానికి ఆమెను పంపిస్తుంది బిజెపి.

ఇక మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో ఆమె ఇంటి ఇంటికి కూడా ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు అనే ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డి అక్కడ దూకుడుగా ప్రచారం చేయడంతో ఆమె రేవంత్ కి పోటీగా ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. రెండు రోజుల్లో ఆమె ప్రచార రంగంలోకి దిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: