వెంకటాపురం 135 డివిజన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎం.పి రేవంత్ రెడ్డి... రాష్ట్ర ప్రభుత్వంపై, బిజెపి నేతలపై మండిపడ్డారు. వెంకటాపురం డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి సంజీవ్ కుమార్ ను గెలిపించాలి అని ఆయన కోరారు. బస్తీలకు గస్తీ కాసే వాళ్ళకి ఓటు వేయండి అని ఆయన సూచించారు. తెరాస నాయకులు వ్యక్తిగత వ్యవహారాలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు అన్నారు.

మతతత్వ రాజకీయాలు చేస్తూ భాజపా,ఎం.ఐ. ఎం లు ప్రజలను రెచ్చగొడుతున్నారు అని మండిపడ్డారు. కరోన,వరదల సమయంలో పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యాయి అన్నారు. హైదరాబాద్ లో ఓటు అడిగే హక్కు కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉంది అని ఆయన స్పష్టం చేసారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాల్సిన సమయం ఇది అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజల కోసం పోరాడుతున్నా అన్నారు. చదువుకున్న వ్యక్తులకు ఓటువేయలని రేవంత్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: